Wednesday, 4 February 2015

Bhagavatham poem no. 43

సీ !!  ఎవ్వనియవతార మెల్లభూతములకు సుఖమును వృద్ధియు సొరిది చేయు
        నెవ్వని శుభనామమేప్రొద్దునుడువంగ సంసారబంధంబు సమసిపోవు
        నెవ్వని చరితంబు హృదయంబు జేర్చిన భయమొంది మృత్యువు పరువునెట్టు
         నెవ్వని పదనదినేపారు జలములు సేవింప నైర్మల్య సిద్ధిగలుగు
తే !! తపసులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరగుగాంచిరి వసుదేవదేవకులకు
        నెవ్వడుదయించె తత్కధలెల్ల వినగ నిచ్చపుట్టెడు నెఱగింపు మిద్దచరిత.

Meaning :

కలియుగములో మనవులనేకమైన బాధలకు లోనవుతారు. శ్రీ కృష్ణుని చరితము వినాలనే సత్సంకల్పము సర్వ శుభదాయకము. మానవులు శ్రీ హరి యొక్క కథలను వింటూ, ఆరాదిస్తూ, ధ్యానిస్తూ, ఉంటే సంసార బంధం నుండి విముక్తులు కాగలరు.    

No comments:

Post a Comment